ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిద్దరి ఆచూకీ చెపితే బహుమతి ఇస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 09:44 PM

వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకీ తెలిపితే రూ.1,116 బహుమతిగా ఇస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకూ రెచ్చిపోయిన వారిద్దరూ సైలెంట్ అయిపోయారని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్‌ విధానాలు, పోకడలు నచ్చకే ఆ పార్టీని అనేక మంది నేతలు వీడుతున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa