అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం నరసాపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేదని దొడ్డి వెంకటరమణ భార్య, పిల్లలు అక్రమ నిర్భంధం చర్చకు దారి తీసింది. గ్రామానికి చెందిన దొడ్డి వెంకటరమణ.. ఇంటి అవసరాల కోసం కొందరు గ్రామస్తుల వద్ద అప్పు చేశాడు. అయితే వడ్డీ రానురాను పెరిగిపోయింది. అప్పు తీర్చే మార్గం లేకుండాపోయింది. అప్పులు కట్టాలంటూ డబ్బుల ఇచ్చిన వాళ్లు ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో అప్పుల ఒత్తిళ్లు భరించలేక మూడు నెలల క్రిందట రైలు కింద తలపెట్టి దొడ్డి వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని చనిపోయిన బాధలో ఉన్న వారిపై కనీసం కనికరం చూపలేదు ఆ వ్యక్తులు. అప్పులు తీర్చాలని అదే గ్రామానికి చెందిన సురేష్, ఈశ్వరరావు,నాయుడు కలిసి వెంకటరమణ భార్య, పిల్లలను గదిలో బంధించి తాళాలు వేశారు. దీంతో నర్సాపురం బాధిత కుటుంబీకులు ఆవేదన వక్తం చేస్తున్నారు. భర్త చేసిన అప్పులు తీర్చాలని అతని భార్య దొడ్డి శ్యామల, వారి కుమారులు పృద్వి, చందులను గదిలో పెట్టి తాళాలు వేసి నిర్భంధించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విషయం తెలిసిన చోడవరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే భర్త అప్పులు తీర్చలేదని ఇలా వారి కుటుంబీకులను నిర్బంధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa