ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:32 PM

కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర సెర్ప్‌, ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన ఎంఎ్‌సఎంఈ సెర్ఫ్‌ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, ఏపీఐఐసీ జెడ్‌ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, బ్యాంకర్లు, వారి సమస్యలు సమావేశంలో చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధి కోసం మొట్టమొదటి సమీక్షా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి, నూతన పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎంఎ్‌సఎంఈ సమస్యలు మాదృష్టికి వచ్చాయని వాటన్నింటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఆటోమొబైల్‌, చేనేత పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఇవికాకుండా కొత్త తరహాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందో, ఇందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమాత్రం లభిస్తాయో అధ్యయనం చేస్తున్నామన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa