విశ్వకర్మ కౌశల్య యోజన పథకం కింద శిక్షణ పొందిన అభ్యర్థులకు వేతనాలు ఇవ్వాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సి.గురుశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం నగర అధ్యక్షురాలు జయమ్మ అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సి.గురుశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్య యోజన పథకం కింద 2023లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నామన్నారు. అయితే రెండు నెలల క్రితం స్కిల్ అకాడమీలో పథకం దోబీ వృత్తి కోసం ఐదు రోజులు శిక్షణ ఇచ్చిందన్నారు. శిక్షణలో ప్రతిరోజు రూ.500 చెల్లిస్తామని ఇప్పటి వరకు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఎలాంటి గ్యారంటీ లేకుండా రజకవృత్తిదారులకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష రుణాలు ఇప్పించా లన్నారు. కార్యక్రమంలో నాయకులు రాముడు, శేషాద్రి, ఎల్లయ్య, వెంకటే శ్వర్లు, మదు, ఈశ్వరమ్మ, పుష్ప, పద్మ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa