ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:42 PM

మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రధానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ‘‘పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్‌ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు’’ అని తెలిపారు.దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని.. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని వెల్లడించారు. మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాన్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa