నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ క్రమంలో బుధవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.ఈ అల్పపీడనం కారణంగా.. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గాలులు గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని వివరించింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇక అన్ని జిల్లాల ఉన్నతాధికారులతోపాటు తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా.. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. కోస్తాతోపాటు రాయలసీమలో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది.మరోవైపు పంట కోసి రైతులు పొలంలో వేసి ఉంచారు. ఇంతలో భారీ వర్షాల కురుస్తాయని వార్త కథనాల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇంకోవైపు కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంట.. వరుణిడి పాలవుతోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదికాక గతంలో పంట ఇన్స్రెన్స్ ఉండేదని.. నేడు అది లేకుండా పోయిందని వారు చెబుతున్నారు. ఓ వేళ తుపానులు, భారీ వర్షాల కారణం పంటలు పోయినా.. ప్రభుత్వం ఇచ్చే పరిహారం గ్రామాల్లో రాజకీయం కారణంగా తమ దాకా రావడం లేదని రైతులు వాపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ను వరుణుడు వీడడం లేదు. రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లో తుపాన్ వచ్చినా.. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్లో దానా తుపాన్.. నవంబర్లో ఫెంగల్ తుపాన్.. కారణంగా.. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులతోపాటు వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa