టీడీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం చిచ్చు రేపుతోంది. పార్టీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి పార్దసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషలతో కలిసి జోగి రమేశ్ వేదిక పంచుకున్నారు. అయితే, దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అనుకోకుండా జరిగిందని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని ఆయన కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని, ఎల్లప్పుడు పార్టీకి విధేయుడిగానే పని చేస్తానని పేర్కొంది. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. జోగి రమేష్తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని తెలిపారు. ఒకవేళ ఆయన అక్కడకు వస్తాడని తెలుసుంటే.. మేము వెళ్లి ఉండేవాళ్లం కాదని, లేకుంటే నిర్వహాకులకు ఆయనను పిలవొద్దని చెప్పేవాళ్లమని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa