బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో మెల్బోర్న్, సిడ్నీలో జరిగే నాలుగో, ఐదో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, స్టార్ ప్లేయర్, ఓపెనర్ బ్యాటర్ నాథన్ మెక్స్వీనీ జట్టు నుంచి తప్పించింది. అతని స్థానంలో 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కొన్స్టాస్కు చోటు కల్పించింది. దీంతో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఈ యంగ్ ప్లేయర్ ఓపెనింగ్ చేయనున్నాడు. కాగా, పింక్-బాల్ టెస్ట్కు ముందు కాన్బెర్రాలో టీమిండియాతో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ XI ప్రాక్టీస్ మ్యాచులో కొన్స్టాస్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.అలాగే గాయం కారణంగా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జే రిచర్డ్సన్తో పాటు సీన్ అబాట్, బ్యూ వెబ్స్టర్లకు జట్టులో చోటు దక్కింది. ఈ మేరకు నాలుగు కొత్త ఎంపికలతో క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ జట్టును ప్రకటించారు.స్కాట్ బోలాండ్, జే రిచర్డ్సన్ ఇద్దరిలో ఒకరు ఆస్ట్రేలియా తరపున ప్లేయింగ్ XIలో జోష్ హేజిల్వుడ్ స్థానంలో ఆడతారని జార్జ్ బెయిలీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa