ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న భువనేశ్వరి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 02:35 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సతీమణి నారా భువనేశ్వరి  చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతోంది. భువనేశ్వరి బస చేస్తున్న పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత కుప్పం మండలం వెంగాటుపల్లి గ్రామంలో ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1:45 గంటల వరకు అడవి బూదుగూరు గ్రామంలో మహిళలతో ముఖాముఖి మాట్లాడతారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు గుండ్ల మడుగు గ్రామంలో మహిళలతో చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లిలో మహిళలతో ముచ్చటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa