తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ టీటీడీకి భారీ విరాళం అందించారు. టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళంగా అందజేశారు. కోటీ పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో ప్రసాద్ విరాళంగా సమర్పించారు. ఈ విరాళం తాలూకు డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతికి అందజేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనను అభినందించారు.
మరోవైపు సోమవారం కూడా టీటీడీకి భారీ విరాళం అందిన సంగతి తెలిసిందే. తిరుపతికి చెందిన లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు.. టీటీడీకి భారీ విరాళం సమర్పించారు. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం కోటి పదివేల 116 రూపాయలను విరాళంగా అందించారు. ఈ విరాళం తాలూకు డీడీని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సూర్య పవన్ కుమార్ను టీటీడీ ఈవో , అదనపు ఈవో అభినందించారు.
అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళంగా అందింది. తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి బంగారు కిరీటాన్ని భక్తులు విరాళంగా అందించారు. చెన్నైకి చెందిన వసంత లక్ష్మి, ఆమె కుమార్తె మాధవి, అల్లుడు మనోహర్ కలిసి ఈ బంగారు కిరీటాన్ని కానుకగా అందజేశారు. ఈ బంగారు కిరీటం విలువ సుమారుగా రూ.27 లక్షలు ఉంటుందని అంచనా. 341 గ్రాముల బంగారంతో ఈ బంగారు కిరీటాన్ని తయారు చేయించి.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు. ఆదివారం ఆలయం అధికారులు బంగారు కిరీటాన్ని విరాళంగా స్వీకరించారు. అనంతరం దాతలకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత పండితులు వేదశీర్వచనం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రస్టులకు భక్తులు, వీఐపీలు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ వివరాలను బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అలాగే దాతలకు శ్రీవారి దర్శనం కల్పించి.. తీర్థప్రసాదాలు అందించి గౌరవించడం ఆనవాయితీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa