బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ను 3-1తో కోల్పోయింది. దీంతో ఈ సిరీస్ తర్వాత భారత జట్టును ప్రక్షాళన చేస్తారనే వార్తలు వచ్చాయి. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరిగింది. అయితే ఈ సిరీస్పై బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో ఆటగాళ్లపై చర్యలు తీసుకోనప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలని సూచించింది.
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆ ఫార్మాట్కు గుడ్బై చెప్పేశారు. ఇక త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు రిషభ్ పంత్ను ఎంపిక చేయలేదు. అతడికి విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు రంజీ ట్రోఫీలో ఆడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టుతో చేరాడు. మంగళవారం నుంచి జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు.
విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్లు కూడా రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రాబబుల్స్ జాబితాలో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ల పేర్లు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడతారనే ప్రచారం జరుగుతోంది. రంజీ తదుపరి రౌండ్ మ్యాచ్లు ఈనెల 23న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ మార్చి 6 నుంచి జరగనుంది. ఒకవేళ కోహ్లీ, పంత్లు ఈ సిరీస్లో ఆడినా.. అప్పటివరకు రంజీలో ఆడే అవకాశం ఉంటుంది.
వీరితో పాటు శుభ్మన్ గిల్ కూడా రంజీ ట్రోఫీపై ఫోకస్ పెట్టాడు. పంజాబ్ తరఫున అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 19 నుంచి ప్రారంభం కానుంది. అప్పటిలోపు దేశవాళీ క్రికెట్లో ఆడి.. ఫామ్ అందిపుచ్చుకోవాలని ఈ ప్లేయర్లు భావిస్తున్నారు. మరి వీరంతా కేవలం రంజీ జట్టుతో ప్రాక్టీస్ మాత్రమే చేస్తారా? తుది జట్టులో ఉంటారా? అనేది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa