ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తకు తలకొరివి పెట్టిన భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 03:29 PM

భర్తకు భార్య అంత్యక్రియలు చేసిన ఘటన శుక్రవారంశ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలం,  హరిదాసుపురంలో సంభవించింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన లఖినాన గణపతి గురువారం రైలు ట్రాక్‌ దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందాడు. మానసిక స్థతి బాగు లేనందున ఈయన ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం గుర్తుతెలియనదిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం గణపతిగా గుర్తించి హరిదాసుపురంలో అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అయితే కుమారుడు సాయి కుమార్‌ విదేశాల్లో ఉండడంతో భార్య తులసమ్మ స్థానిక పెద్ద పైల నేతాజీ తదితరుల సూచనల మేరకు భర్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa