ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 06:43 PM

డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న వైజాగ్ ముఠా గుట్టు రట్టు చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి రూ. 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, సిమ్ మ్యాడ్యుల్స్, 8 రూటర్లు, ఒక ముద్దాయి ఖాతాలోని బాధితురాలికి సంబంధించిన రూ. 10 లక్షలు సీజ్ చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్లు ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు.నిందితులపై నిఘా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. విచారణలో దాదాపు రూ.2.5 కోట్ల సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తమ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తిరుపతిలోని ఓ మహిళకు వాట్సాప్ కాల్ చేసి ఢిల్లీ సీబీఐ అధికారుల అంటూ రూ.200 కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్లు ఆమెను భయపెట్టారని చెప్పారు. సదరు మహిళ పైన ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినట్లు మహిళ చెప్పడంతో భయపడిందన్నారు. భయపడిన మహిళ వద్ద నుంచి రూ. 2.5 కోట్లు ముద్దాయిలు కాజేశారు. డబ్బులు తీసుకెళ్లాక ఫోన్ కాల్ రాకపోవడంతో మహిళకు అనుమానం వచ్చిందన్నారు. తిరుపతి పోలీసులను బాధితురాలు ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారని చెప్పారు.. మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం దర్యాప్తు జరిపామని తెలిపారు. విచారణలో విశాఖపట్నానికి చెందిన ఏడు మంది ముద్దాయిలను అదుపులో తీసుకున్నామని చెప్పారు. నిందితుల దగ్గరి నుంచి ఒక కారు, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు, రూ.32.5 లక్షల నగదు, ఒక సిమ్ మాడ్యులర్, 8 రూటర్లను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa