ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహా మోసంతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఈజీగా మనీ సంపాదించాలనే కోరిక ఉన్న వారే లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఈ తరహాలోనే సరికొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తాజాగా మరో కొత్త మోసానికి కేటుగాళ్లు తెగబడ్డారు. డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ క్రిమినల్స్ బాధితులను బయపెట్టి భారీ మొత్తంలో కాజేస్తు.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రజలకు సూచించారు. సైబర్ క్రిమినల్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు వార్నింగ్ ఇచ్చారు.డిజిటల్ అరెస్టు ద్వారా ఫోన్ , వీడియో కాల్స్ ద్వారా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. డిజిటల్ అరెస్టు అనేది అసలు లేదని స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ పెట్టీ కేసులు పెట్టడం ద్వారా ప్రజల్లో పోలీసులకు ఒక మంచి భావన ఏర్పడిందని చెప్పారు. ఫింగర్ ప్రింట్ సిస్టమ్లో ఆంధ్రప్రదేశ్ వెనుక బడి ఉందని... తాను డీజీపీగా వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను మెరుగుపరిచానని అన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇవాళ(మంగళవారం) సందర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్రలో గంజాయి నిర్మూలన, డ్రగ్ కంట్రోల్ చేయడమే ప్రధాన లక్ష్యమని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. చాలా మందికి తమ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్, అలవెన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లానని... వెంటనే పోలీస్ వెల్ఫేర్ కోసం రూ.4 కోట్ల 70 లక్షలను మంజూరు చేశారని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa