ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్‌ నేరాలపై ప్రజలకి అవగాహనా కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:21 PM

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని పీలేరు అర్బన సీఐ యుగంధర్‌ తెలిపారు. పీలేరులోని సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు సైబర్‌ మోసాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.......  తక్కువ సమయంలో పెట్టుబడులను రెట్టింపు చేస్తామని చాలా మంది మోసగాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోకూడదన్నారు. ఎస్‌ఐ బాలకృష్ణ మాట్లాడుతూ అటువంటి ఫోన కాల్స్‌ వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాలని లేదా 1930 నెంబరకు తెలియజేయాల న్నారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, అధ్యాపకులు లెఫ్టినెంట్‌ డా.వెంకటరమణ య్య, షేక్‌ రఫీ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa