నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే సత్ఫలితాలొ స్తాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లో నిఘా కోసం డ్రోన్స్ కూడా వినియోగిస్తున్నామన్నారు. జిల్లా నుంచి జమ్ము-కాశ్మీర్ వెళ్లి నిందితులను అరెస్టు చేసి, కేసులు చేధించి, రూ.20 లక్షలు రికవరీ చేసిన పోలీసులను అభినందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేశామని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. త్వరలో ఇన్స్పెక్టరు నుంచి డీఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రజలు, యువతకు వివరించి వారిని చైతన్యపరిచేందుకు సంకల్ప రథాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. సమావేశంలో విశాఖ రేంజ్ డీఏజీ గోపీనాథ్జెట్టి, ఎస్పీ వకుల్జిందాల్, ఏపీఎస్పీ కమాండెంట్ మలికాగార్గ్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa