ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటకాల్వలో కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:53 PM

నరసాపురం పరిధిలోని  జిన్నూరు పంటకాల్వలో సోమవారం కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం సంచలనం కలిగించింది. పొట్టలో కత్తి పోటుతో పాటు కాళ్లు కట్టేసిన మృతదేహం సోమవారం కొప్పర్రు గ్రామం వద్దకు కొట్టుకు వచ్చింది. పథకం ప్రకారం హత్య చేసి కాల్వలో పడేసి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహన్ని గ్రామస్తుల సమాచారంతో పోలీసులు వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ వెంకట సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లు మండలం వెలివెలి నుంచి మొగల్తూరు మండలం శేరేపాలెం వెళ్లే పంట కాల్వలో కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గ్రామస్తు లు గమనించారు. ఈ సమాచారాన్ని వీఆర్వోకు తెలియజేశారు. వీఆర్వో నాగేంద్ర సంఘటన స్థలాన్ని సందర్శించి రూరల్‌ పోలీసులకు సమా చారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీయగా కాళ్లు కట్టేసి, పొట్టలో కత్తిపోటు గాయాలున్నాయి. హత్యచేసి కాల్వలో పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎక్కువ రోజులు నీళ్లలో ఉండడం వల్ల కుళ్లిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. డీఎస్పీ శ్రీవేద, రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్‌ ఎస్‌ఐ వెంకట సురేష్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa