ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను మోసం చేయడమే ఆయన పని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 05:14 PM

పేదల ద్వేషి చంద్రబాబునాయుడు అని, ప్రజలను మోసం చేయడమే ఆయన పని అని అయినా.. పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించిన చంద్రబాబుకు, కూటమి పార్టీలు, ఎల్లో మీడియా వంత పాడాయని, ఆ తర్వాత బాబు ఆ హామీలు అమలు చేయకపోయినా, ఎవరూ నోరెత్తడం లేదని గుర్తు చేశారు. ఇకనైనా వారు ప్రశ్నించాలని కోరారు.    ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కావని వైయ‌స్ జగన్‌గారు స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు ఏడు నెలల తర్వాత స్వయంగా చంద్రబాబు నోట అదే మాట వచ్చిందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. తప్పుడు హమీలతో ప్రజలను వంచించి అధికారంలోకి రావడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు కారణంగా రాజకీయ నాయకులపై ప్రజల్లో నమ్మకం పోతోందని ఆక్షేపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa