అనంతపురం జిల్లాలో లా అండర్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ‘‘ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్లు నియోజకవర్గానికి పోతానంటే పోనీయరు.. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళితే రివర్స్ కేసులు పెడతారు.. పోలీస్స్టేషన్లలోనే కొడతారు.. మీడియాలో కథనాలు వస్తే రైలు పట్టాలపై పడుకోబెడతామని బహిరంగంగా వార్నింగ్ ఇస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంత మాట్లాడుతూ ..‘‘ కూటమి అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు ఉన్నాయి. పోలీసు, రెవెన్యూ శాఖలు నిర్వీర్యం అయ్యాయి. కలెక్టర్, ఎస్పీ, డీఐజీలు చేతగాని వాళ్లలా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లారు. మేం నిమిత్తమాత్రులం అని వాళ్లు చెప్పకనే వారి చర్యల ద్వారా అర్థమవుతోంది. అధికారం అనే ఆయుధంతో టీడీపీ నాయకులు ముందుకెళ్తున్నారు. మేం ఏది చెప్తే అదే శాసనం అంటూ వ్యవహరిస్తున్నారు. వాళ్లను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో తరచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. మేం ముందు నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా.. చివరకు అన్నదమ్ముల ఆస్తులు భాగాలు పంచుకోవాలన్నా టీడీపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa