వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు చెప్పాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం ఇస్తారా? ప్రజలు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్యే ఎవరైనా 60 రోజులపాటు లీవ్ అడగకుండా సభకు రాకుంటే.. అనర్హత పడుతుందని అన్నారు. తన కస్టోడియల్ టార్చర్లో పీవీ సునీల్ పాత్రపై రఘురామ స్పష్టంచేశారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. ప్రభుత్వానికి తాను ఒక బాదితుడిగా పిర్యాదు చేశానని రఘురామ తెలిపారు. శాసన సభ్యుడు ఎవరైనా 60 రోజుల పాటు సరైన కారణం చెప్పకుండా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వర్తిస్తుందని... అప్పుడు పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయని రఘురామ కృష్ణరాజు చెప్పారు.జగన్ అసెంబ్లీకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని.. దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు. గతంలోతాను ఎన్నో ఫిర్యాదులు చేశానని గుర్తుచేశారు. సమాజాన్ని మతాలు, కులాల వారిగా విడగొట్టే విధంగా వైసీపీ నేతలు మాట్లాడారని ఆరోపించారు. సునీల్ కుమార్ అతి తెలివి తేటలు ఉపయోగించి యూట్యూబ్లో ఉన్న వీడియోలు తీసేశారని చెప్పారు. ప్రభుత్వానికి తాను ఒక బాదితుడిగా ఫిర్యాదు చేశానని తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇస్తే దానిపై ఐపీఎస్ అధికారి ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు. సునీల్ కుమార్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని ప్రభుత్వాన్ని అడిగానని అన్నారు. తన కస్టోడియల్ టార్చర్పై పోరాటం ఆగదని రఘురామ స్పష్టం చేశారు.