ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టుల దాడిలో జవాన్లకు గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 12:15 PM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు మంగళవారం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబ్‌పై ఇద్దరు జవాన్లు అడుగు వేయడంతో అది పేలింది. ఆ ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరో జవాను మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్‌పై అడుగు వేయడంతో గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్లను రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com