ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం పండగలాంటి వార్త చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తాజా ఉత్తర్వులు విడుదల చేసింది కేంద్రం. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి.రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డివిజన్లో 410 కిలోమీటర్లు పరిధిని చేర్చారు రైల్వే అధికారులు.
కొండపల్లి - మొటుమర్రి సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.ఎన్నో రోజులుగా ఉత్తరాంధ్ర వాసులకు చిరకాల వాంఛగా ఉన్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం 410 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్చింది కేంద్రం. విశాఖ డివిజన్ పరిధిలో ఏయే మార్గాలను చేరుస్తున్నారనే విషయాన్ని కూడా వెల్లడించింది కేంద్రం. అదే విధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను మార్చారు.