బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తాజాగా మీడియా ముందే హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నారు. జీ7 నాయకుల్లో ఇలా బహిరంగంగా హెచ్ఐవీ టెస్టు చేయించుకున్న తొలి ప్రధానిగా కీర్ స్టార్మర్ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఆయన ఇలా చేయడానికి కారణం.. ఆయనకు హెచ్ఐవీ సోకినట్లు అనుమానం రావడం మాత్రం కాదు. హెచ్ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగానే అందరి ముందు కీర్ స్టార్మర్ ర్యాపిడ్ హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నారు. టెరెన్స్ హిగ్గిన్స్ సంస్థతో కలిసి.. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లో గల తన ఇంటి వద్దే ప్రధాని కీర్ స్టార్మర్ ఈ టెస్టు చేయించుకున్నారు.
అయితే ఈ పరీక్షల్లో యూకే ప్రధానికి నెగిట్ రాగా.. ఆ విషయాన్ని కూడా తెలిపారు. అంతేకాకుండా దేశ ప్రజలంతా ధైర్యంగా ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవీ పరీక్ష చాలా ముఖ్యమైనదని.. ఇందులో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపారు. ఇంట్లోనే కూర్చుని.. సులువుగా చేసుకోగలిగే ఈ పరీక్షను వారం రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కూడా ఆయన చెప్పారు. మరో ఐదేళ్లలో దేశంలో ఒక్క కొత్త హెచ్ఐవీ కేసు కూడా నమోదు కాకూడదనే లక్ష్యాన్ని చేరుకునేందుకు.. ప్రజలు ముందుకొచ్చి ఈ పరీక్ష చేయించుకోవాలన్నారు.
బ్రిటన్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లోనే హెచ్ఐవీ కార్యాచరణ ప్రణాళికను ప్రవేశ పెట్టింది. 2030 నాటికి దేశంలో ఒక్క కొత్త హెచ్ఐవీ కేసు కూడా ఉండకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. 2012వ సంవత్సరం నుంచే యూకే సర్కారు వారం రోజుల పాటు ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కల్పించింది. ప్రతీ ఏటా ఈ టెస్టులు చేస్తుండగా.. అనేక మంది పరీక్షలు చేయించుకుంటున్నారు.
బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం దేశంలో దాదాపుగా 4,700 మంది నిర్ధారణ కాని హెచ్ఐవీతో జీవిస్తున్నారని.. వారిని కనుగొనే వ్యూహంలోనే ఈ పరీక్షలను పెంచినట్లు తెలిపింది. అలాగే 2023 నాటికి పూర్తిగా హెచ్ఐవీని అంతం చేయాలనే లక్ష్యానికే తాము కట్టుబడి ఉన్నట్లు యూకే ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa