ఉపాధి కోసం కొనుగోలు చేసిన ట్రాక్టరే అతడి ప్రాణం తీసింది. కుటుంబపోషణకు అండగా ఉంటుదనున్న ట్రాక్టరే ఆ కుటుంబానికి అతడ్ని దూరంచేసింది. పొలం పనుల కోసం ట్రాక్టర్పై ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే అతడ్ని బలితీసుకున్న విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరక ఆమదాలవలస పరిధిలోని పొందూరు మండలం తాడివలస గ్రామానికి చెందిన తమ్మి నేని భాస్కరరావు(54) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబానికి అండగా ఉంటుందని భావిం చిన భాస్కరరావు ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేసి తన పొలం పనులతోపాటు అద్దెలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన పొలంలోనే వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్పై వెళ్తుండగా.. ఆమదాలవలస మం డలం బెలమాం గ్రామ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పడింది.ఈ ఘటనలో ట్రాక్టర్ కింద భాస్కరరావు చిక్కుకుపోయాడు. సమీపంలో ఉన్నవారు వచ్చి ట్రాక్టర్ను తొలగించినా ఫలితం లేకపోయింది. ట్రాక్టర్ కిందపడి ఉన్న భాస్కరరావు మృతదేహం నుజ్జునుజ్జయింది. కాగా అతడికి భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇరువు రు కుమార్తెలకు వివాహం కాగా కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న ఆమదాలవలస ఎస్ఐ సనపల బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కాగా అందరితో కలివిడిగా ఉండే భాస్కరరావు అకాలమృతితో తాడివలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa