ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి తెరపైకి భూముల రికార్డులను స్కానింగ్‌ ట్యాంపర్‌ వ్యవహారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 09:37 AM

విశాఖపట్నంలో భూముల రికార్డులను స్కానింగ్‌ చేసి భద్రపరిచే క్రమంలో వాటిని ట్యాంపర్‌ చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రికార్డులు స్కానింగ్‌ చేసే సమయంలో మోసపూరితంగా వ్యవహరించిన ఏడుగురు అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఈ నెల 22న విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. రెవెన్యూ రికార్డులు పాడైపోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డులను స్కానింగ్‌ చేసి భద్రపరచాలని 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విశాఖ రూరల్‌ మండలంలోని భూముల రికార్డులను సర్వే శాఖ స్కానింగ్‌ చేసింది. ఈ క్రమంలో 2004 నుంచి 2007 మధ్య స్కానింగ్‌ చేసేటప్పుడు మధురవాడలో సర్వే నంబర్లు 367, 368, 369, 370, అదేవిధంగా కొమ్మాది, పరదేశిపాలెంలో పలు ప్రభుత్వ భూముల రికార్డులు మార్చేశారు. రెవెన్యూలో కొందరు అధికారులు, రియల్టర్లు కలిసి.. రికార్డుల్లో ప్రభుత్వ భూమి బదులు కొందరు వ్యక్తుల పేర్లు నమోదు చేశారు. క్లాసిఫికేషన్‌లో జిరాయితీగా పేర్కొంటూ ట్యాంపర్‌ చేశారు. తర్వాత సదరు రికార్డుల్లో ఉన్న వ్యక్తులు, వారి తరఫున రియల్టర్లు రంగ ప్రవేశంచేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించారు. సర్వే నంబరు 367లో కొన్ని నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు అప్రమత్తమై రికార్డులు పరిశీలించినపుడు ట్యాంపరింగ్‌ చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa