న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించిన బాధితులను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను ముద్దాయిలుగా చిత్రీకరించి జైలు పాలుజేస్తున్న దుర్మార్గమైన విధానం ఏపీలో కొనసాగుతోందని తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వేణుగోపాల కృష్ణ.. చంద్రబాబు పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, చట్టాలు చేయాల్సిన ప్రభుత్వమే యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం ద్వారా మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటున్న టీడీపీ.. దాంతో ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఈ ఐదేళ్లు పాలన చేయడం కుదరదని హెచ్చరించారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదన్న మాజీ మంత్రి, ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే ఈయన మాత్రం మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ, తలసేమియా బాధితులను ఆదుకోవడం కోసమంటూ చందాలు అడగడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa