నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహిస్తుంది. ప్రతి యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని అక్కడికి వచ్చే కంపెనీలతో ఇంటర్వ్యూలో పాల్గొంటే వారి చదువు తగ్గట్లు ఉద్యోగం పొందవచ్చు. దీనిలో భాగంగానే విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్లో ఫిబ్రవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. విప్రో సొల్యూషన్, అస్ట్రోటెక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, MBA, MCA ఉత్తీర్ణత సాధించి 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 సం., మధ్య వయసు ఉండాలని తెలిపారు.విద్యా అర్హత పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఆపై చదువు పూర్తిచేసి ఉండాలి అని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూకు బయోడేటా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి ఎన్.శ్యాంసుందర్ తెలిపారు. మరిన్ని వివరాలకు www.naipunyam.ap.gov.in 6304634447, 9398338105 సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. నిరుద్యోగ యువత అవకాశం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa