ప్రభుత్వాస్పత్రుల్లో సేవల్ని మెరుగుపర్చే చర్యల్లోభాగంగా వైద్యులపై నిఘా పెట్టాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణా రాహి త్యం, అక్రమాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. 2019-24 కాలంలో అప్పటి ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ వైద్యుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించే వైఖరిపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో దారితప్పి వ్యవహరిస్తున్న డాక్టర్ల వైఖరిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా విశాఖ కేజీహెచ్లోని ఆర్థోపెడిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంపోలు అచ్యుతరావుపై చర్యలకు మంత్రి ఆదేశించారు. సదరు వైద్యుడిని తక్షణమే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి బదిలీ చేయాలని, ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదులపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ అచ్యుతరావు వికలాంగులకిచ్చే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు, ఆపరేషన్లు చేయడానికి డబ్బు తీసుకోవడంతో పాటు ఆయన చేసిన శస్త్ర చికిత్సల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. వీటితో పాటు సహచర సిబ్బంది, వైద్య విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర సీనియర్ల ఆదేశాల్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో మంత్రి చర్యలకుఆదేశించారు. డాక్టర్ అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యంవల్ల ప్రజలకు మెరుగైన సేవలందించేలక్ష్యం దెబ్బతింటుందంటూ, ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు ఎంతైనా అవసరమని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa