ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు నమోదవుతున్నప్పటికీ, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, రాష్ట్రంలో GBS రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.GBS బాధితులకు అవసరమైన ఇమ్యూనోగ్లోబుల్ ఇంజెక్షన్లు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఈ వ్యాధి ఉన్నవారిలో చాలామందికి చికిత్స అవసరం లేకుండానే స్వయంగా తగ్గిపోతుందని వివరించారు. "రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 43 GBS కేసులు నమోదయ్యాయి. వీరిలో 17 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గతేడాది, ఈ ఏడాది నమోదైన మొత్తం కేసులపై విశ్లేషణ చేసి, ఈ వ్యాధి వ్యాప్తికి కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించాం.""GBS బాధితులకు రాష్ట్రవ్యాప్తంగా సరిపడా ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన 85 శాతం మంది చికిత్స లేకుండానే కోలుకుంటారు. కేవలం 15 శాతం మందికి మాత్రమే ఇంజెక్షన్లు అవసరం అవుతాయి." అని మంత్రి అన్నారు.ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 749 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 469 ఇంజెక్షన్లు స్టాక్ లో ఉన్నాయి. అవసరమైతే మరింతమందికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. "ప్రతి ఇంజెక్షన్ ఖర్చు ₹20,000 వరకు ఉంటుంది. ఒక్క రోగికి రోజుకు 5 ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. మొత్తం 5 రోజుల పాటు చికిత్స కొనసాగుతుంది. అయినప్పటికీ, ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోంది." అని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa