తాడేపల్లి నివాసం నుంచి బుధవారం ఉదయం కాన్వాయ్లో బయలుదేరిన వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకున్నారు. జగన్ కోసం భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కాసేపట్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అయితే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తమకు ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడుతున్నారు. రైతులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa