ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులపై నీ వ్యాఖ్యలు సబబేనా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 12:45 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని విమర్శించారు. ఒక పధకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని విజయవాడ వచ్చారని.. పోలీసులు ముందే పసి‌గట్టి ఎక్కడికక్కడ నివారించారని తెలిపారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయట పెట్టాయన్నారు. నీ పిల్లలను‌ కలవాలన్నా కూడా అదే పోలీసులు అనుమతి నీకు ఉండాలి జగన్. వంశీని కలిసిన తరువాత జగన్ పని అయిపోయింది. నందిగం సురేష్‌ను ఇలా ఎందుకు కలవలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకు అసూయ అంట. జగన్ వ్యాఖ్యలు చూసి వంశీ సతీమణి అక్కడే నవ్వుకుంటున్నారు.. వీడియో చూసుకో. అధికారంలో ఉండగా తొడలు కొట్టి, మీసం తిప్పి, జబ్బలు చరిచారు. కొడాలి నాని నిన్న జగన్‌తో వచ్చి .. మళ్లీ అప్పుడే వెళ్లిపోయాడు. సవాళ్లు చేసిన కొడాలి నానికి ఎందుకంత భయం’’ అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa