ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా సంఘాల్లో మహిళలకు టూవీలర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 01:02 PM

డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీపికబురు తీసుకువచ్చింది. సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. దీని వ్లల డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ ఊరట కలుగనుంది. అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.డ్వాక్రా మహిళా కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి తీపికబురు. మెప్మా అధికారులు రాపిడో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఎలా అని అనుకుంటున్నారా..డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుటుంబాల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే.. వారికి టూవీలర్, త్రీవీలర్ అందించనున్నారు. దీని ద్వారా ఉపాధి పొందొచ్చు. ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు.అనకాపల్లి టౌన్‌లో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సిటీ బస్‌లు ఉండవు. అందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే డ్వాక్రా సంఘాల్లో మహిళలు, కుటుంబ సభ్యులకు టూవీలర్లు , త్రీవీలర్లు ఇచ్చి.. వారికి ఉపాధి కల్పించనున్నారు.దీని వల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది. ఇటు డ్వాక్రా సంఘాల్లోని వారికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి మేలు కలుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.అర్హత కలిగిన వారికి లక్షా 30 వేల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తారు. లేదంటే 3 లక్షల 70 వేల ఎలక్ట్రిక్ ఆటోను ఇస్తారు. దీని ద్వారా ఉపాధి పొందొచ్చు.అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది. అంతేకాకుండా రాపిడో కూడా నెలకు రూ.500 చొప్పున ఏడాది పాటు డబ్బులు చెల్లిస్తుంది.అధికారులు మాట్లాడుతూ. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు, లేదంటే వారి కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఉపాధి పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa