ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాతో 35 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టించాడంటూ మండిపాటు

international |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 02:11 PM

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జెలెన్ స్కీని నియంతగా పోల్చిన ట్రంప్.. తాజాగా ఆయనను కమెడియన్ గా సంబోధించారు. ఈ కమెడియన్ అమెరికాతో ఏకంగా 35 వేల కోట్లు ఖర్చు పెట్టించాడని మండిపడ్డారు. ఈమేరకు జెలెన్ స్కీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రష్యాతో మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ తీరును జెలెన్ స్కీ జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడి చుట్టూ అబద్ధాలు, తప్పుడు సమాచారమే ఉందని ఇటీవల జెలెన్ స్కీ వాపోయారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కోసం తాము పోరాడుతున్నామని, తమ భూభాగంపై రష్యా దురాక్రమణను అడ్డుకుంటున్నామని చెప్పారు.అయితే, ట్రంప్ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటలను విశ్వసిస్తూ తమ ఆవేదనను అర్థం చేసుకోవడంలేదన్నారు. బైడెన్ హయాంలో అమెరికా తమకు అందించిన సాయాన్ని ట్రంప్ బాధ్యతలు చేపట్టాక నిలిపేశాడని చెప్పారు. అమెరికా సాయం లేకుంటే ఉక్రెయినియన్లు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరని చెప్పారు. కాగా, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలన్న లక్ష్యంతో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ దూత లెఫ్టినెంట్‌ జనరల్‌ కీత్‌ కెల్లాగ్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మీడియా సమావేశంలో నేతలు ఇద్దరూ మాట్లాడాల్సి ఉండగా.. దానిని రద్దు చేశారు. అమెరికా విజ్ఞప్తి చేయడంతో రద్దు చేసినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa