డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. జనసేన పార్టీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ జనసేన శ్రేణులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, నరసరావుపేటలో పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ విషయంలో కేసులు నమోదైనట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసిన జనసేన కార్యకర్తలు .. మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు.. పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, తనయుడు అకీరా నందన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఇటీవల కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి బాడీ షేమింగ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జనసేన శ్రేణులు మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. ఏయే అకౌంట్ల నుంచి వీటిని పోస్ట్ చేశారు, వాటి వెనుక ఎవరున్నారనే దానిని తేల్చే పనిలో పడ్డారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా పర్యటన సందర్భంగా జంధ్యం ధరించడంపైనా తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడేమో ఆయన పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి, వైరల్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అటు పోలీసులు సైతం ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, కామెంట్లపై ఏపీ పోలీసులు ఇటీవల స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa