ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్కీమ్ మళ్లీ వచ్చింది.. ప్రతి నెలా చేతికి రూ.5 వేలు

business |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 11:03 PM

యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. అదే ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS). 2024 వార్షిక బడ్జెట్‌లోనే ఈ పథకాన్ని ప్రకటించారు. మొదటి విడత కింద టాప్-500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం గతేడాది నవంబర్ 2024లోనే దరఖాస్తులు స్వీకరించారు. అయితే, చాలా మంది యువత మొదటి విడతలో అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాంటి వారందరికీ అదిరే శుభవార్త. పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. ఈసారి మరింత ఎక్కువ మందికి అవకాశం కల్పించనున్నారు. ఈసారి ఏకంగా టాప్-730 కంపెనీలను ఎంపిక చేశారు. మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఈ మేరకు రెండో విడత దరఖాస్తుల ఆహ్వానంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 20, 2025 రోజున ఓ ప్రకటన జారీ చేసింది. పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో భాగంగా ఈసారి 1 లక్ష మందికిపైగా యువతకు ఇంటర్న్‌షిప్ కల్పించేందుకు 730కిపైగా కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ స్కీమ్ ప్రధానంగా 21- 24 ఏళ్ల వయసు ఉన్న యువతపై ఫోకస్ చేస్తోంది. ఈ వయసులో ఉన్న యువత ఏదైనా డిగ్రీ చేస్తున్నా, ఉద్యోగంలో ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.


ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడత పీఎంఐఎస్ పైలెట్ ప్రాజెక్టును అక్టోబర్ 3, 2024న ప్రారంభించారు. pminternship.mca.gov.in ఆన్‌లైన్ సైట్ అందుబాటులోకి తెచ్చారు. నవంబర్ 15, 2024 వరకు అవకాశం కల్పించారు. గడువు లోపు మొత్తం 6 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లిడించింది. యువత నుంచి మంచి స్పందన వస్తున్న క్రమంలో రెండో విడతను చాలా తక్కువ సమయంలోనే తీసుకురావడం గమనార్హం. రౌడ్-2 పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 12, 2025 వరకు గడువు ఇచ్చారు. ఆలోపు దరఖాస్తు చేసుకున్న వారికి 730 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు.


అర్హులైన యువత అధికారిక వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తమకుంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. వివిధ సెక్టార్లలో తమకు అనువైన ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి అప్లై చేసుకోవాలి. రెండో విడత కింద ప్రతి ఒక్క దరఖాస్తుదారుడు 3 ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 12 నెలల పెయిడ్ ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. నెల నెలా రూ.5000 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత ఒక్కసారి రూ.6000 ఆర్థిక సాయం చేస్తారు. ఈ ఆర్థిక సాయం పొందేందుకు బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ఇన్సూరెన్స్ సైతం కల్పిస్తారు.


అర్హతలు ఇవే..


భారతీయ పౌరులు అయి ఉండాలి. దరఖాస్తు గడువు ముగిసే నాటికి యువత వయసు 21- 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఫుల్ టైమ్ ఉద్యోగం చేసే వారు లేదా ఫుల్-టైమ్ డిగ్రీ చేస్తున్న వారికి అర్హత ఉండదు. కానీ, ఆన్‌లైన్, డిస్టెన్స్ లర్నింగ్ ప్రోగ్రామ్‌లో ఉన్న వారికి అర్హత ఉంటుంది. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. లేదా ఇంటర్ లేదా ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుంది. అలాగే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీ చేసిన వారు సైతం అర్హులై.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa