ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీపీఎస్సీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 08:25 PM

ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొనడంతో సీఎం చంద్రబాబు APPSCపై ఆగ్రహం వ్యక్తం చేశారు. CM ఆదేశాలపై APPSC స్పందించకోవడంతో ఆయన మండిపడ్డట్లు తెలుస్తోంది. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని APPSCకి లేఖ రాశారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని CM తెలిపారు.ఈ మేరకు రోస్టర్ విధానంలో తప్పులను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలని కోరింది. ఇందుకు సంబంధించి లేఖ కూడా రాసింది. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా వేయాలని సూచించింది. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీపీఎస్సీ స్పందించలేదు. లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంతోపాటు ప్రభుత్వ లేఖపై ఇంతవరకు స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa