నామినేటెడ్ పదవులను మార్చి నెలాఖరులోగా భర్తీచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మే నెలలో జరిగే మహానాడు నాటికి పూర్తవుతుందన్నారు. నామినేటెడ్ పదవులకు తమ పక్కన తిరిగే వారిని కాకుండా పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేయాలని శాసనసభ్యులకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయ కమిటీ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల (ఏఎంసీలు) పదవులను మార్చిలోగానే భర్తీ చేస్తామన్నారు. సమర్థులకే సహకార అధ్యక్ష పదవులు ఇస్తామని తెలిపారు.నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేటెడ్ పదవుల కోసం తమ ప్రతిపాదనలను వెంటనే పోర్టల్లో పెట్టాలని సూచించారు. మీరు ఇవ్వాల్సిన డేటా ఇవ్వకుండా పదవులు భర్తీ చేయాలంటే ఎలా కుదురుతుందని వారిని ప్రశ్నించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి(కేఎ్సఎస్) బాధ్యత చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేఎ్సఎ్సల నియామకం మార్చి 30 నాటికి పూర్తికావాలని, మార్చి 31 నుంచి ఏప్రిల్ నెలాఖరుకల్లా క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa