ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి వందనం పధకం అమలుకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 08:28 AM

సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక హామీ అమలుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘తల్లికి వందనం’ పథకానికి 2025-26 బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరం నుంచి అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున ఈ పథకానికి మొత్తం రూ.12వేల కోట్లు అవసరం. ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో ప్రభుత్వం అదనంగా నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa