ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పులపై అసత్యాలు మాట్లాడి, ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 08:37 AM

బాధ్యతాయుతమైన ముఖ్య‌మంత్రి పదవిలో ఉండి కూడా.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని పచ్చి అసత్యాలతో నిందించడం మీ స్థాయికి భావ్యమా? అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని దయచేసి వెంటనే ఆపాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ఇవాళ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో రాష్ట్ర అప్పులపై గత వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వంపై సీఎం చంద్రబాబునాయుడు  చేసిన దుష్ప్రచారంపై ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబునాయుడు మరోసారి అసత్య ప్రచారం ప్రజలకు నిజం తెలియాలంటే మీరు బడ్జెట్‌ పుస్తకంలో వాల్యూమ్‌–6 (బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌)లో అప్పుల వివరాలు ప్రతి సంవత్సరం మాదిరిగా తెలపాల‌ని బుగ్గ‌న  డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa