ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ పథకాన్ని మళ్లీ తెచ్చిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 05:57 PM

ఏపీలోని టీడీపీ కూటమి సర్కారు.. గతంలో తాము అమలుచేసిన అనేక కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని చేనేత కార్మికుల కోసం ఓ పథకాన్ని మళ్లీ తీసుకువచ్చారు. 2014-19 మధ్యకాలంలో అమలుచేసిన థ్రిఫ్ట్ ఫండ్ పథకం వైసీపీ హయాంలో రద్దైంది. అయితే నేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. పథకం అమలు కోసం నిధులు కూడా కేటాయించింది. అయితే ఏమిటా థ్రిఫ్ట్ ఫండ్ పథకం అనేది ఇప్పుడు చూద్దాం.


2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ.. 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో తాము అమలు చేసిన కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు, పథకాలను తిరిగి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేనేత కార్మికులకు ఆర్థిక దన్నుగా నిలిచే ఓ పథకాన్ని తిరిగి తీసుకువచ్చింది. చేనేత కార్మికుల కోసం గత టీడీపీ హయాంలో థ్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేశారు.


అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేసింది. అయితే నేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూటమి ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మళ్లీ తీసుకువచ్చింది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో చేనేత కార్మికులకు అధిక ప్రయోజనం కలగనుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో పాటుగా ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం రూ.5 కోట్లు నిధులను కేటాయించారు. ఇందులో మెజారిటీ వాటా చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాకు దక్కనుంది.


 చేనేత కార్మికులకు ఆర్థికంగా మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం తీసుకువచ్చారు. అయితే ఈ పథకానికి చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న చేనేత కార్మికులు మాత్రమే అర్హులు. ఈ పథకం కింద చేనేత సహకార సంఘాలలో సభ్యుడిగా ఉన్న కార్మికుడు తన నెలవారీ సంపాదనలో 8 శాతాన్ని పొదుపు చేస్తే.. ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్ నుంచి 16 శాతాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తుంది. మూడు నెలలకు ఒకసారి చొప్పున చేనేత కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది.


ఉదాహరణకు చేనేత కార్మికుడు నెలకు రూ.1000 చొప్పున పొదుపు చేస్తే.. ప్రభుత్వం దానికి మరో రెండు వేలు జమ చేస్తుంది. ఈ లెక్కన చేనేత కార్మికులు ఏడాదికి 12 వేలు పొదుపుచేస్తే.. ప్రభుత్వం నుంచి రూ.24 వేలు జమవుతుంది. అంటే మొత్తం రూ.36 వేలు కూడా బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో చేనేతలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న చేనేత సహకార సంఘాలలోని సభ్యులకు కూడా ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరే అవకాశం కల్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa