ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేనేతలకు ప్రభుత్వం శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 07:18 PM

తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందగా, 2024 ఎన్నికల్లో తిరిగి గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ గతంలో అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. గత టీడీపీ హయాంలో అమలైన థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది.2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేసింది. దీంతో చేనేత కార్మికులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరోసారి ఈ పథకాన్ని పునరుద్ధరించడంతో, రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఊరట లభించనుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులలో ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎక్కువ వాటా దక్కనుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa