విజయనగరం జిల్లాలో మూగజీవాల వ్యాపారం అత్యధికంగా సాగుతోంది. అన్ని ప్రాంతాల నుంచి కబేళాలకు తరలుతున్నాయి. పెదమానాపురం, అలమండ, అచ్చుతాపురం సంతలు ఇందుకు కేరాఫ్గా పేరొందాయి. ఈ మార్కెట్లలో భారీగా ఆవుల విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి వ్యాపారులు ఆవులను కబేళాలకు తరలిస్తున్నారు. కొన్ని విజయనగరం తీసుకువెళ్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి మాంసం రూపంలో ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్కెట్లకు ఆవులను తరలించే క్రమంలో దారి మధ్యలో ఎక్కడైనా పోలీసులకు చిక్కినా నాయకులు, వ్యాపారుల నుంచి ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో కబేళా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ఒట్టిపోయిన పశువులను, వ్యవసాయ పనులకు ఉపయోగపడని వాటినే కబేళాకు తరలించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. దూడలను సైతం అమ్మేస్తున్నారు. అందులోనూ మగ దూడ అయితే పుట్టిన కొద్దిరోజులకే కబేళాకు తరలిస్తున్నారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురం నుంచి కబేళాలకు అత్యధికంగా తరలిపోతున్నాయి. ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి పశువులను గురువారం నుంచి సంతకు చేర్చుతుంటారు. శనివారం ఆవులను అమ్మేస్తారు. ఆపై వ్యాపారులు భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలించుకు పోతున్నారు. కొందరు సోమవారం జరిగే అలమండ సంతకు అడ్డదారుల్లో కాలినడకన పశువులను తోలుకెళ్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa