ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా జిల్లాలో పునుగుపల్లి సంచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 12:34 PM

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగుపిల్లిని స్థానికులు గుర్తించారు. రాత్రి సమయంలో పునుగుపల్లి సంచరించడాన్ని చూసిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పునుగుపిల్లిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వలవేసి మరీ పునుగుపల్లిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అలాగే నిన్న (ఆదివారం) గుంటూరు జిల్లాలోనూ ఈ అరుదైన జాతి పునుగుపిల్లి సంచరించింది. ఓ ఇంట్లో వెళ్లి దాక్కున్న పునుగుపిల్లిని చూసి మొదట మామూలు పిల్లి అని అంతా భావించారు. కానీ అది వింతగా కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ప్రజలను చూసి ఆ పునుగుపల్లి (టోడీక్యాట్‌) భయాందోళనకు గురై ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కుంది. అది పారిపోకుండా స్థానికులు కాపలా కాశారు. చివరకు ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని పునుగుపిల్లిన పట్టుకున్నారు. జనావాసాల్లోని పునుగుపిల్లి రావడంపై అవీశాఖ అధికారులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పునుగుపిల్లి ఒక్కటే ఉండదని మరికొన్ని ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మిగితా వాటి కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa