ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌టెల్ నుంచి మరో రెండు ఐపీఓలు

business |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 10:12 PM

మీరు పెట్టుబడుల కోసం స్టాక్ మార్కెట్‌ను ఎంచుకుంటున్నారా.? ఇక్కడ రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మంచి అవగాహనతో సరైన స్టాక్ ఎంచుకొని సరైన సమయంలో నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని చెబుతుంటారు. అయితే ఇక్కడ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఇంకా ఇన్వెస్టర్లను ఎక్కువ ఊరిస్తుంటాయి. వీటిల్లో లిస్టింగ్ గెయిన్స్ కాస్త ఎక్కువే ఉంటాయి. పాస్ట్ రిటర్న్స్ ఇదే ప్రూవ్ చేశాయి. స్టాక్ మార్కెట్లో ఐపీఓల హడావుడి ఎక్కువే ఉంటుంది. ఇక్కడ మార్కెట్ లాభనష్టాలు, ఊగిసలాటలతో పెద్దగా సంబంధం లేకపోయినా ఓ మోస్తరు నుంచి భారీగా రిటర్న్స్ లిస్టింగ్‌తోనే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు నిపుణులు.


ఇక ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకు మాత్రం డిమాండ్ భారీగా ఉంటుంది. వీటి కోసం ముందుగానే సంస్థ నిర్దేశించిన ప్రత్యేక తేదీల్లో.. సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయిస్తుంది. గతంలో ఇలా ప్రముఖ కంపెనీల ఐపీఓలు అదరగొట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఊరించే ప్రకటన వచ్చింది.


దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్తగా రెండు ఐపీఓలను దలాల్ స్ట్రీట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దీంట్లో ఒకటి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కాగా.. మరొకటి డేటా సెంటర్ వ్యాపారమైన ఎన్‌ఎక్స్‌ట్రా. ముందుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓకు రానుంది. డేటా సెంటర్ బిజినెస్.. ఆ తర్వాత ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు.


భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు.. 2017లోనే కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 700 కోట్ల ఆదాయం, రూ. 18.5 కోట్ల నికర లాభం నమోదు చేసింది. పదేళ్లలో లిస్టింగ్ కావాల్సి ఉన్నందున.. దీనిని ఐపీఓగా తీసుకురాబోతుంది. రాబోయే రోజుల్లోనే ఈ ఐపీఓ రాబోతుందని తెలుస్తోంది. ఇంకా.. డేటా సెంటర్ బిజినెస్ నిర్వహిస్తున్న భారతీ ఎన్ఎక్స్‌ట్రా కూడా ఐపీఓకు రాబోతుంది. దీంట్లో 75 శాతం వాటా.. ఎయిర్‌టెల్‌కు ఉంది. మరో 24 శాతం వాటా కార్లే ఈక్విటీ సంస్థకు ఉంది. డేటా సెంటర్ వ్యాపారంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 12 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 231.8 కోట్ల లాభం, రూ. 1826 కోట్ల ఆదాయం నమోదు చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa