ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇచ్చిన మద్దతు ధరతో ఒక్క టిక్కీ మిర్చి అయినా కొన్నారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 07:54 AM

మిర్చి అమ్మకాలు ప్రారంభమైన రెండు నెలల తర్వాత వ్యాపారులను వివరాలు అడగడం చూస్తుంటే కాలయాపన చేసి దళారులకు లాభం చేకూర్చాలన్నది ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.11,781 మద్దతు ధరకు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క టిక్కీ మిర్చి అయినా కొన్నారా? అని ప్రశ్నించిన ఆయన, మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ చొరవ చూపకపోయి ఉంటే చంద్రబాబు కనీసం కేంద్రానికి లేఖ కూడా రాసే వాడు కాదని గుర్తు చేశారు. గత ఏడాది రూ. 27వేల వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం రూ.10 వేల కూడా పలకడం లేదని, రైతులు అప్పుల బాధలు భరించలేక కల్లాల వద్దే తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా చంద్రబాబు మనసు కరగడం లేదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోంది? అన్న విషయం అర్ధం కావడం లేదన్న లేళ్ల అప్పిరెడ్డి, మిర్చి ధరలు దారుణంగా పతనమై రైతులు అల్లాడుతున్నారని, అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం హేయమని అన్నారు. రైతు సమస్యలపై రాజకీయాలు చేయడం ప్రభుత్వానికి తగదని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa