ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన ఎంవీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 03:34 PM

రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం టెక్కలి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పెండింగ్‌ ఫైళ్లను పరిశీలించారు. విజిబుల్‌ పోలీ సింగ్‌, నూతన ఎంవీ చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కలిగించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు రాత్రి గస్తీ పెంచాలని సీఐ విజయ్‌కుమార్‌కు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa