ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 08:32 AM

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయొద్దని, వాళ్లకు ఉపకారం చేస్తే, పాముకు పాలు పోసినట్లే అని బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ పదవికి అనర్హుడని, దీనిపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డి వెల్లడించారు. సీఎం స్థాయిలో అలా హేట్‌ స్పీచ్‌ చేయడం ఏ మాత్రం సరి కాదన్న ఆయన, చంద్రబాబు మీద హేట్‌ స్పీచ్‌ సెక్షన్లతో కేసు నమోదు చేసి, అనర్హత వేటు వేయొచ్చని స్పష్టం చేశారు. తమ ఫిర్యాదుపై గవర్నర్‌ స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం చూడాలని, దూరవిద్యలో చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు. ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీ కూటమికి చెంపపెట్టు అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతకు అది నిదర్శనమని తేల్చి చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa