పల్నాడు జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. పందికొక్కులు దాడి చేయడంతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. నూజెండ్ల మండలం రవ్వారంలో గురవయ్య, దుర్గమ్మ దంపతులకు నాలుగు నెలల క్రితం బాలుడు జన్మించాడు.
బుధవారం చిన్నారి నిద్రపోతుండగా తల్లి బయటికెళ్లింది. ఈ సమయంలో పందికొక్కులు చిన్నారిపై దాడి చేయగా చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చిన్నారి మరణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa