జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలే లక్ష్యంగా డీజిల్ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ వ్యవహారంపై దృష్టిపెట్టిన పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా బాపట్ల జిల్లా మేదరమెట్ల నుంచి జిల్లాలోని సింగరాయకొండ వరకూ జాతీయ రహదారిపై కొందరు ప్రత్యేక వాహనాల్లో తిరుగుతూ ఆగి ఉన్న లారీల ట్యాంక్ల నుంచి డీజిల్ దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అనేక మంది డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని ఎస్పీ దామోదర్ సీరియ స్గా పరిగణించారు. జాతీయ రహదారిపై చెలరేగిపోతున్న డీజిల్ దొంగలను పట్టుకోవాలని సీసీ ఎస్ పోలీసులను ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం మద్దిపాడు పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా దొంగల ముఠా ఆగి ఉన్న లారీ నుంచి డీజిల్ తస్కరిస్తూ కనిపించింది. దీంతో ముగ్గురిని పట్టుకున్నారు. ఆ ముఠా ఇతర జిల్లాల నుంచి మినీ వ్యాన్లో వచ్చి డీజిల్ దొంగతనం చేస్తున్న ట్లు తెలిసింది. ఈ డీజిల్ ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారు.. అన్న అంశాలను పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు. హైవేపై లారీ డ్రైవర్ల వద్ద కూడా కొంతమంది డీజిల్ కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి వారిని కూడా రెండు రోజులుగా సీసీఎస్ పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa