ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 10:05 AM

మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై చిట్టిగూడూరు వద్ద గురువారం విజయవాడ నుంచి బందరు వస్తున్న ఆర్టీసీ ప్యాసింజర్‌ బస్సును వెనుక నుంచి టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టిన ఘటనలో టాటా ఏస్‌ డ్రైవర్‌, టీడీపీ ఆకుమర్రు గ్రామ అధ్యక్షుడు బొల్లా మోహనరావు మృతి చెందాడు. మోహనరావు రోజూ ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడ సర్వీస్‌ చేస్తుంటాడు. బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. టాటా ఏస్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగు గాయపడటంతో చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కె.ఎన్‌.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa